జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో బోధిస్తేనే బాగుంటుందని విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీనారాయణ అన్నారు. పరభాషలో బోధిస్తే విద్యార్థులు మాతృభాష, ఇతర భాష రెండింటినీ నేర్చుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో ముఖ్యమని, ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు.
‘రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీన్ని అమలుచేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాలి. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సూచించారు. ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం (ఏపీపీఎస్ఏ) ‘జాతీయ విద్యావిధానం’పై మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. జాతీయ విద్యా విధానాన్ని పాఠశాలలు ఓ అవకాశంగా మార్చుకుంటే గొప్ప పురోగతి ఉంటుందని సూచించారు.
6వ తరగతిలోనే వృత్తివిద్య