ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సోమవారం గవర్నర్​ అపాయింట్​మెంట్​ కోరనున్న రాజధాని రైతులు

By

Published : Dec 22, 2019, 7:56 PM IST

రాజధాని మార్పుపై అమరావతి రైతులు పోరును ఉద్ధృతం చేస్తున్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు.. రేపు గవర్నర్​ అపాయింట్​మెంట్​ను కోరనున్నారు.

Capital farmers seeking tomorrow's governor's appointment
Capital farmers seeking tomorrow's governor's appointment


భవిష్యత్​ ఉద్యమ కార్యాచరణను రాజధాని రైతుల ఐకాస ప్రకటించింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో వంటావార్పును చేపట్టనున్నారు. ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. అనంతరం రేపు రాజధాని ప్రాంత రైతులు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరనున్నారు.

ABOUT THE AUTHOR

...view details