ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2021, 7:21 PM IST

ETV Bharat / city

కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుపై కేంద్ర కార్యదర్శి ఆరా

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ... వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీకి చెందిన కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుపై చర్చించారు.

Cabinet Secretary Rajiv Gauba Review on pending Railway Projects
సీఎస్​లతో కేబినెట్ కార్యదర్శి సమావేశం

ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై దిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీకి చెందిన పెండింగ్ ప్రాజెక్టు కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని50:50 నిష్పత్తిలో భరించేందుకు కుదిరిన ఒప్పందంపై కేంద్ర కార్యదర్శి ఆరా తీశారు. దీనిపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని... దీని ప్రకారం పనులు వేగవంతం చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించారు.

దేశంలో రైల్వే ప్రాజెక్టులన్నీ ఈ విధానంలోనే చేపడుతున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మారుమూల ప్రాంతాల వారికి రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు కడప-బెంగళూర్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ.. విభజన కారణంగా ఏపీ తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉందని... ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోని భూసేకరణలో మాత్రమే 50 శాతం వ్యయాన్ని భరించగలుగుతామని సీఎస్ తెలిపారు. మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ భరించేలా చూడాల్సిందిగా సీఎస్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details