ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. సంక్షేమంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

By

Published : Oct 30, 2019, 1:51 PM IST

Updated : Oct 30, 2019, 2:58 PM IST

cabinet-meet-chaired-by-cm-jagan-at-secreatarte

ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్‌ సమావేశం సచివాలయంలో ముగిసింది. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు ఖరారు చేశారు. రాష్ట్రంలో అగ్రిల్యాబ్‌లను ఏర్పాటు చేసే అంశంతో పాటు జెరూసలెం, హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం పెంపు అంశంపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల రిజిస్ట్రేషన్‌, రెండేళ్ల తర్వాత విక్రయించేందుకు వీలుగా జీవో సవరణ, దేవాలయాల్లో ట్రస్టీల నియామకం తదితర అంశాలపై ప్రతిపాదనలు కేబినెట్‌ ముందు చర్చకు వచ్చినట్టు సమాచారం. వీటితోపాటు జిల్లా సచివాలయ నిర్మాణం కోసం బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌కు సంబంధించి చర్చ చేసినట్టు తెలిసింది.

Last Updated : Oct 30, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details