ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యమ వాణికి సినారె పురస్కారం.. ప్రకటించిన తెలంగాణ సారస్వత పరిషత్తు

సినారె పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేస్తున్న సాహితీ పురస్కారానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ వాణి బలంగా వినిపించారు. ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు, కిమ్స్‌ ఉషాలక్ష్మీ రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రఘురాంను సైతం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది.

By

Published : Jul 21, 2021, 10:32 AM IST

సినారె పురస్కారాలు
సినారె పురస్కారాలు

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేస్తున్న సాహితీ పురస్కారానికి ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ఎంపికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ వాణి బలంగా వినిపించారు.

సినారె జయంత్యుత్సవంలో..

ఈ నెల 29న తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తంగా నిర్వహించనున్న సి.నారాయణరెడ్డి 90వ జయంత్యుత్సవంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారం కింద రూ.25 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details