ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''బ్రాండిక్స్' విస్తరణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి' - బ్రాండిక్స్ కంపెనీ న్యూస్

తమ సంస్థ విస్తరణలో  ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వస్త్ర తయారీ సంస్థ బ్రాండిక్స్... పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి విజ్ఞప్తి  చేసింది.  ఆ సంస్థ సీఈవో అష్రఫ్ ఓమర్ సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.

'బ్రాండిక్స్' విస్తరణలో ప్రభుత్వం జోక్య చేసుకోవాలి!
'బ్రాండిక్స్' విస్తరణలో ప్రభుత్వం జోక్య చేసుకోవాలి!

By

Published : Dec 16, 2019, 9:57 PM IST

'బ్రాండిక్స్' విస్తరణలో ప్రభుత్వం జోక్య చేసుకోవాలి!

తమ సంస్థలో దాదాపు 98 శాతం మంది ఉద్యోగులు స్థానికులేనని మంత్రి గౌతమ్ రెడ్డికి బ్రాండిక్స్ సంస్థ సీఈవో ఓమర్ తెలిపారు. మరో మూడేళ్లలో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని... పారిశ్రామిక వృద్ధిలో భాగస్వాములం అవుతామని బ్రాండిక్స్ సీఈఓ ‌అన్నారు. ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తుందని బ్రాండిక్స్ ప్రతినిధులు తెలిపారు. బ్రాండిక్స్ సమస్యలు పరిష్కరించి ఆ సంస్థ విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. గార్మెంట్స్ పాలసీ రూపొందించేందుకు వారి అభిప్రాయాలు తీసుకుంటామని గౌతమ్ రెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details