జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ ధ్యేయంగా పేర్కొన్నారు. తాము ప్రజలకు తప్ప విపక్షాలకు జవాబుదారీ కాదని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న భూములు అభివృద్ధి చేసి రైతులకు ఇస్తామన్న మంత్రి... అసైన్డ్ భూములు మాత్రం పూర్తిగా తిరిగి ఇస్తామని చెప్పారు. ఆ భూముల గురించే మంత్రులు మాట్లాడారని తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు చెప్పిన బొత్స.. 13 జిల్లాల ప్రజల ప్రాధాన్యం మేరకే ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కమిటీ మాత్రం అన్ని విషయాలను పరిశీలించే నివేదిక ఇచ్చిందని తేల్చి చెప్పారు.
'మంత్రివర్గంలో చర్చించాకే... నివేదికపై నిర్ణయం' - రాజధానిపై బొత్స కామెంట్స్
రాజధానిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల 27న కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు.
!['మంత్రివర్గంలో చర్చించాకే... నివేదికపై నిర్ణయం' botsa satyanarayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5441972-453-5441972-1576858245537.jpg)
బొత్స సత్సనారాయణ
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్సనారాయణ
ఇదీ చదవండి: