ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 22, 2020, 7:42 PM IST

ETV Bharat / city

టికెట్​ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో గన్‌ఫౌండ్రీ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గన్​ఫౌండ్రీ భాజపా అభ్యర్థి ఓం ప్రకాశ్​పై టికెట్​ ఆశించి భంగపడ్డ శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు.

bjp-workers-a
bjp-workers-a

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో గన్‌ఫౌండ్రీ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సురేఖ ఓంప్రకాశ్‌కు టికెట్‌ అమ్ముకున్నారని ఆరోపించారు. కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు కార్యాలయం నుంచి బయటకు పంపించారు.

టికెట్​ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

గన్​ఫౌండ్రీ భాజపా అభ్యర్థి ఓం ప్రకాశ్​పై టికెట్​ ఆశించి భంగపడ్డ శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, లక్ష్మణ్​లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా నుంచి వచ్చిన ఓంప్రకాశ్​కు టికెట్​ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. స్థానిక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​పై కిషన్​రెడ్డి, లక్ష్మణ్ కక్షగట్టారని గన్​ఫౌండ్రి డివిజన్ భాజపా అధ్యక్షుడు శైలేందర్ యాదవ్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details