ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భాజపాపై కుట్రకు తెదేపా-వైకాపా యత్నం: సత్యకుమార్

By

Published : Mar 24, 2021, 10:39 AM IST

రాష్ట్రంలో భాజపా ఎదగనివ్వకుండా తెదేపా-వైకాపా ఒక్కటై కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఏపీ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని... వచ్చే ఐదేళ్లలో రూ. 5.23 లక్షల కోట్ల నిధులు ఇవ్వనున్నామని చెప్పారు.

bjp national secretary satya kumar
bjp national secretary satya kumar

తిరుపతిలో కేంద్రం చేసిన అభివృద్ధిపై భాజపా జాతీయ కార్యదర్శి వీడియో విడుదల చేశారు. భాజపాను రాష్ట్రంలో గెలిపించకపోయినా అభివృద్ధిలో లోటు చేయలేదన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.5.23 లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇవ్వనున్నామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో 2 లక్షల నకిలీ ఓటర్ కార్డులు సృష్టించారని ఆరోపించారు. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం, హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. తెదేపా-వైకాపా ఒక్కటై భాజపాపై కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details