ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా అధికారంలోకి రావాలని ఏపీ ప్రజల ఆంకాంక్ష: సీఎం రమేశ్ - ఎంపీ జీవీఎల్

దేశాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రధాని మోదీ నడిపిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏడాదిలో తేలిపోయిందని విమర్శించారు. ఏపీలోని ప్రజలు భాజపా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

bjp mp cm ramesh
bjp mp cm ramesh

By

Published : Jun 1, 2020, 1:44 PM IST

దేశాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా మోదీ నడిపిస్తున్నారని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేరేలా మోదీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. సామాన్యులు సైతం విమాన ప్రయాణం చేసేలా కేంద్రం సంస్కరణలు తెచ్చిందని గుర్తు చేశారు. ప్రపంచదేశాల్లో భారత్‌కు ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో తేలిపోయిందన్న ఆయన... భాజపా అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.

మోదీ ప్రభుత్వానికే సాధ్యమైంది: జీవీఎల్

ఏడాది కాలంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు, కార్యక్రమాలు చేపట్టిందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. 70 ఏళ్లలో సాధించలేని, సాధ్యం కావనుకున్న పనులు మోదీ ప్రభుత్వానికే సాధ్యమైందని తెలిపారు. కరోనాపై పోరులో భారత ప్రభుత్వం సమర్థంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

ఇదీ చదవండి:

మంగళవారం దిల్లీకి ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details