ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రామ తీర్థమే కాదు.. అన్ని ఘటనలపై విచారణ జరిపించండి' - attacks on temples in andhra pradesh latest news

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలమీద దాడుల అంశంపై సీఐడీ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్​ దేవధర్​ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. భాజపా, జనసేన రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

bjp leader sunil devdar fires on cm jagan
సునీల్​ దేవధర్

By

Published : Jan 5, 2021, 4:17 PM IST

భాజపా రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకోవడంపై సునీల్​ దేవధర్​ ఆగ్రహం

భాజపా తలపెట్టిన రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జి సునీల్​ దేవధర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని, తెదేపా అధినేత చంద్రబాబును అనుమతించి.. భాజపా, జనసేన నేతలను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన నేతలపై దాడి చేసి.. వారిని అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది భాజపా, జనసేన నేతలను గృహ నిర్బంధం చేశారని దుయ్యబట్టారు.

'ఏపీ సీఎం జగన్​ రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఘటన జరిగి వారంరోజులైంది. ఇప్పటి వరకూ సీఎం జగన్​ నిద్రపోతున్నారా? భాజపా, జనసేన నేతలు పోరాటం చేసిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించారు. రామతీర్థం ఘటనపైనే ఎందుకు సీఐడీ విచారణ ఎందుకు ఆదేశించారు? మిగిలిన ఆలాయాలపై జరిగిన దాడుల సంగతేమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల దాడుల అంశంపై విచారణకు ఆదేశించకుంటే.. భాజపా పోరాటం చేస్తుంది.'

- సునీల్​ దేవధర్​, భాజపా ఏపీ వ్యవహారాల సహ ఇన్​ఛార్జి

ఇదీ చదవండి:

రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details