ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని కోసం.. ఫిబ్రవరి 2న భాజపా-జనసేన లాంగ్​ మార్చ్‌ - bjp-janasena will work together

ఇక నుంచి ఏ కార్యక్రమమైనా కలిసి నిర్వహించాలని భాజపా-జనసేన నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాజధానిపై కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.

bjp-janasena will  take decisions together in any programme
రాష్ట్రంలో పలు కార్యక్రమాలను ఉమ్మడిగా నిర్వహించనున్న భాజపా- జనసేన

By

Published : Jan 22, 2020, 7:54 PM IST

Updated : Jan 22, 2020, 9:04 PM IST

ఇకపై కలిసి పని చేయాలని భాజపా-జనసేన నేతలు నిర్ణయించారు. దిల్లీలోని ఎంపీ జీవీఎల్​ నివాసంలో భేటీ అయిన ఇరు పార్టీల నేతల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజధాని రగడపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈనెల 28న విజయవాడలో సమావేశం కానున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జనసేనతో సమావేశమవుతామని చెప్పారు.

రాజధానిపై భాజపా- జనసేన కార్యాచరణను వెల్లడిస్తోన్న కన్నా

ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్: నాదెండ్ల
అమరావతి రైతులకు అండగా నిలబడతామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. భూములు త్యాగం చేసిన రైతులపై ప్రభుత్వం వైఖరి సరికాదన్న ఆయన... ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్‌ నిర్వహించనున్నామని తెలిపారు. వైకాపా నాయకులు రాజకీయాలను తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

రాజధానిపై భాజపా- జనసేన కార్యాచరణను వెల్లడిస్తోన్న నాదెండ్ల


రేపు ఉదయం 9.30 గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలుస్తామని జీవీఎల్‌ తెలిపారు. రాష్ట్ర రాజకీయాలపై తాము చేసే ఉమ్మడి కార్యాచరణ గురించి తెలియజేస్తామన్న ఆయన... సమన్వయ కమిటీలో ఎవరు ఉండాలనేది నిర్ణయిస్తామని తెలిపారు.

రాజధానిపై భాజపా- జనసేన కార్యాచరణను వెల్లడిస్తోన్న జీవీఎల్

ఇదీ చూడండి: రాజధానిపై భాజపా, జనసేన ఉద్యమ కార్యాచరణ ఖరారు

Last Updated : Jan 22, 2020, 9:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details