ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 19, 2020, 6:50 PM IST

ETV Bharat / city

రేపటి అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

మూడు రాజధానుల ప్రతిపాదన, CRDA చట్టం రద్దు బిల్లులు.. శాసనసభతో పాటు మండలిలో గట్టెక్కడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌ పలువురు మంత్రులతో భేటీ అయ్యారు.

big suspense on tomorrow assembly meetings
అసెంబ్లీ సమావేశాలు

మూడు రాజధానుల ప్రతిపాదన, CRDA చట్టం రద్దు బిల్లులు.. శాసనసభతో పాటు మండలిలో గట్టెక్కడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. బిల్లుల ఆమోదం కోసం అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపై.. ముఖ్యమంత్రి జగన్‌ పలువురు మంత్రులతో చర్చించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో వైకాపా పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మండలిలో వైకాపాకు బలం తక్కువగా ఉన్నందున.. బిల్లులను గట్టెక్కించడంపై సమాలోచనలు జరిపారు. మండలిలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలనే దానిపైనా దృష్టి సారించారు. ఇదే సమయంలో అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టే బిల్లులపై ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది.

అసెంబ్లీ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details