కరోనా మహమ్మారి మూగజీవాలను కూడా వదట్లేదు అన్న విషయం తెలిశాక జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ శునకాలకు ఎక్కడ కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారు. మరికొందరైతే... ఏకంగా కొవిడ్ పరీక్షలు చేపించేందుకు పశువైద్యశాలలకు క్యూకట్టారు.
కుక్కలకు కరోనా... ఆసుపత్రులకు జనాల పరుగులు? - బోయిగూడ పశువైద్యశాల
దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో ఉన్న సింహాలకు కొవిడ్ సోకడం వల్ల జంతు ప్రేమికులంతా భయపడుతున్నారు. తమ ఇళ్లల్లో పెంచుకుంటున్న శునకాలకు ఎక్కడా కరోనా సోకుతుందోనని నగరవాసులు పశువైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. పెంపుడు శునకాలకు పరీక్షలు చేపించేందుకు వచ్చిన వారితో సికింద్రాబాద్ బోయిగూడ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది.
![కుక్కలకు కరోనా... ఆసుపత్రులకు జనాల పరుగులు? dogs effect in coona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:47:34:1620267454-11654693-pp.jpg)
dogs effect in coona
సికింద్రాబాద్ బోయిగూడలోని పశువుల ఆసుపత్రికి... జంతుప్రేమికులు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ పెంపుడు జంతువులకు కొవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యశాల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. మరోవైపు... శునకాలకు కొవిడ్ వస్తుందని ఇప్పటివరకూ.. ఎలాంటి ఆధారాలు లభించలేదని పశువైద్యశాల ఉన్నత వైద్యుడు నాగరాజు వెల్లడించారు. దీనిపై కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు.