ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతభత్యాలు ఖరారు - latest news of ap governament

బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతాల అలవెన్సులను ఖరారు చేసింది. ఛైర్మన్​కు రూ.56వేలు, డైరెక్టర్​కు రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ap govap governamenternament
జీతభత్యాలు ఖరారు

By

Published : Nov 2, 2020, 10:36 PM IST

బీసీ కులాల సంక్షేమ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతాలు, అలవెన్సులను ప్రభుత్వం ఖరారు చేసింది. కార్పొరేషన్ ఛైర్మన్​కు రూ.56 వేలు ఇవ్వాలని నిర్ణయించగా.. డైరెక్టర్​కు రూ. 12వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఒక్కో బీసీ కులం కార్పొరేషన్​కు రూ. 2.12 లక్షలు కేటాయించనుంది. ఈ మొత్తంతోనే కార్యాలయం వసతి, ఇతర ఖర్చులు భరించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈనెల 1 నుంచి ఉత్తర్వులు అమలవుతాయని పేర్కొంది.

ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్​ల జీతాలు ఖరారు...

ప్రాఫిట్ మేకింగ్‌ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లకు జీతాలు, అలవెన్సులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాఫిట్ మేకింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు రూ.65 వేల జీతం, డైరెక్టర్‌కు రూ.14 వేల జీతం ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో ప్రాఫిట్ మేకింగ్‌ కార్పొరేషన్‌కు ఖర్చుల కోసం రూ.2.56 లక్షలు కేటాయించనుంది. ఈ నెల 1 నుంచి ఉత్తర్వులు అమలవుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి

'సీఎం, సలహాదారుల చర్య కోర్టు ధిక్కరణే..! కానీ.. '

ABOUT THE AUTHOR

...view details