నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న తెలంగాణ రాష్ట్రం హైదారాబాద్లోని బాలాపూర్ గణనాథుడు (balapur Ganapati) గంగమ్మ ఒడికి చేరాడు. భారీ శోభాయాత్ర నడుమ.. బాలాపూర్ గణపయ్యను నిమజ్జనానికి (ganapathi Immersion) తీసుకొచ్చారు. రాష్ట్ర పోలీసు శాఖ డీజీ శిఖా గోయల్ సమక్షంలో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.
శోభాయాత్ర సాగిందిలా..
హైదరాబాద్ (hyderabad) బాలాపూర్ నుంచి నిమజ్జనానికి ఉదయం బయలుదేరిన భారీ గణనాథుడు... చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, బేగంబజార్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్నారుడ. సాగర్ వద్ద ఉన్న 9వ నంబర్ క్రేన్ వరకు శోభాయాత్ర కొనసాగింది. భారీ గణనాథుడి నిమజ్జనానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దారి పొడవునా