ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పుడే మహిళా సాధికారత సాధ్యం: నందమూరి బాలకృష్ణ - Awareness on cancer at Basavatarakam Hospital

Awareness Program on Cancer: బసవతారకం ఆసుపత్రిలో.. మహిళల్లో క్యాన్సర్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఆసుపత్రి ఛైర్మన్​ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్న బాలకృష్ణ.. మహిళల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు.

Awareness seminar on cancers in women
మహిళల్లో క్యాన్సర్​పై అవగాహన సదస్సు

By

Published : Mar 25, 2022, 10:45 PM IST

మహిళల్లో క్యాన్సర్​పై అవగాహన సదస్సు

Balakrishna on Women Empowerment: అతివలకు అన్నిరంగాల్లో అవకాశమిచ్చినపుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్- నివారణ చర్యలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా హక్కులను కాపాడాల్సిన అవసరముందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

'ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానంగా అవకాశాలు అందుకుంటున్నారు. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అన్యాయాలపై ఎన్నో పోరాటల ఫలితంగా మహిళలకు అనేక రకాల హక్కులు, రక్షణలు లభించాయి. అయినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి.' - నందమూరి బాలకృష్ణ

ఇదీ చూడండి:Chandrababu : 'గ్రామగ్రామాన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి'

ABOUT THE AUTHOR

...view details