ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సంతకం చేసే ముందు ఓసారి ఆలోచించండి'

By

Published : May 30, 2020, 12:23 PM IST

Updated : May 30, 2020, 1:32 PM IST

ఎస్​ఈసీపై హైకోర్టు తీర్పుతోనైనా.. దస్త్రాలపై సంతకం చేసే ముందు పునఃపరిశీలించుకోవాలని గవర్నర్​ను కోరారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. హైకోర్టు సంచనల తీర్పు వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం అవుతుందన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

'సంతకం చేసే ముందు ఓసారి ఆలోచించండి'
'సంతకం చేసే ముందు ఓసారి ఆలోచించండి'

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతోనైనా దస్త్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు గవర్నర్​ పునరాలోచించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు ఆర్డినెన్స్​పై గవర్నర్ సంతకం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

"న్యాయం, ధర్మాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. న్యాయస్థానం తీర్పు నియంత జగన్ చెంపచెల్లుమనిపించింది. రాష్ట్రాన్ని పాలించడమంటే జైలులో ఉన్నంత తేలిక కాదు. కక్ష సాధింపు చర్యలు మాని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించండి. జగన్​కు ఆప్తులైన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వీరిద్దరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని తెలిసినా సీఎం జగన్ వారిని ప్రోత్సహిస్తున్నారు."

----- అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి

ఇదీ చదవండి:

వైకాపా విధ్వంసకర పాలనకు ఏడాది : తెదేపా

Last Updated : May 30, 2020, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details