ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుకు భరోసా... ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన - Pradhan Mantri Kisan Samman Nidhi Yojana founds releasing the central governament

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా 7.60 కోట్ల లబ్ధిదారులకు నిధులను విడుదల చేసింది. ఇప్పటివరకు 35 వేల 882 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

Assure the farmer to Pradhan Mantri Kisan Samman Nidhi Yojana
రైతుకు భరోసా... ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన

By

Published : Dec 12, 2019, 10:25 PM IST

రాష్ట్రానికి సంబంధించి నవంబర్ నెలకు గాను 43.20 లక్షల మంది రైతులకు పీఎం - కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లో 46.86 లక్షల మంది రైతులు ఈ పథకం కింద నమోదు కాగా.. అందులో 43.20 లక్షల మంది రైతులకు కేంద్రం నిధులిచ్చింది. జిల్లాల వారీగా చూసుకుంటే అనంతపురంలో 4.72 లక్షలు, కర్నూలులో 4.05 లక్షలు, తూర్పు గోదావరిలో 4 లక్షలు, గుంటూరులో 3.89 లక్షలు, చిత్తూరు 3.75 లక్షలు, ప్రకాశం 3.48 లక్షలు, పశ్చిమ గోదావరిలో 3.22 లక్షలు, పశ్చిమ గోదావరిలో 3.04 లక్షలు, విశాఖపట్నంలో 2.83 లక్షల మంది, వైయస్ఆర్ జిల్లాలో 2.56 లక్షలు, విజయనగరంలో 2.40 లక్షలు, నెల్లూరులో 2.28 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు.

ఆధార్​ లింకు ఉన్న ఖాతాలకు మాత్రమే నిధులు

డిసెంబరు నుంచి పీఎం కిసాన్ నిధులను అర్హత గల రైతులకు, ఆధార్ లింకు చేయబడి ఉన్న బ్యాంకు ఖాతాలకు మాత్రమే బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. లబ్ధిదారులకు వాయిదాల పద్దతిలో వివిధ దశల్లో పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కొంతమంది రైతులకు మూడు వాయిదాలు లభించగా, కొంతమందికి రెండు వాయిదాలు అతికొద్ది మందికి మాత్రమే ఒక వాయిదా లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చూడండి:

భారత్​లో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details