ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSRTC Cargo Service: ఇంటికే ఏపీఎస్​ఆర్టీసీ కొరియర్ సేవలు... వివరాలివే! - APSRTC Courier Services started in ANDHRA PRADESH

ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా ఏపీఎస్​ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటి వద్దకు ​కొరియర్ సేవల వివరాలు ఇలా ఉన్నాయి.

apsrtc-courier-services-started-in-andhra-pradesh
ఇంటికే ఏపీఎస్​ఆర్టీసీ కొరియర్ సేవలు... వివరాలివే!

By

Published : Sep 4, 2021, 11:55 AM IST

ఏపీఎస్ఆర్టీసీ కొత్త హంగులతో దూసుకుపోతుంది. కరోనా వ్యాప్తి సమయంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఏపీఎస్​ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ఫోకస్​ పెట్టింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకోవడంతోపాటు... ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కార్గో సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటిసారి ఇలాంటి సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది. ఇదే మార్గంలో ఏపీఎస్​ఆర్టీసీ కూడా ప్రయాణిస్తోంది.

మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్​ డెలివరీ సదుపాయాన్ని తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుంచి ఈ కార్గో రవాణా డోర్​ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపించాలన్నా.. వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా.. బస్టాండ్‌లోని కొరియర్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు తమ ఇళ్ల వద్దే సేవలు అందించనున్నారు.

జిల్లా కేంద్రాలైన శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ఈ డోర్​ డెలివరీ సౌకర్యం కల్పించారు.

ఇంటికే ఏపీఎస్​ఆర్టీసీ కొరియర్ సేవలు..

  • ఒక కేజీ బరువుకు - 18 రూపాయలు
  • ఒక కేజీ నుంచి 5 కేజీల బరువుకు - 30రూపాయలు
  • ఆరు కేజీల నుంచి 10 కేజీల బరువుకు - 36 రూపాయలు

ప్రారంభదశలో డోర్​ డెలివరీ 10 కిలోమీటర్లు, 10 కేజీల వరకు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రజలను సోమరిపోతులను చెయ్యొద్దంటూ వాలంటీరు లేఖ

ABOUT THE AUTHOR

...view details