ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 18, 2022, 8:58 PM IST

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ టాప్ వార్తలు
ఏపీ టాప్ వార్తలు

  • వాటిలో నాణ్యత తప్పనిసరి.. లేదంటే తీవ్ర చర్యలు: సీఎం జగన్‌
    జగనన్న ఇళ్లకు వినియోగించే విద్యుత్ పరికరాల్లో నాణ్యత లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని ముఖ్యమంత్రి జగన్ అధికారులను హెచ్చరించారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. నాణ్యత ఉన్న పరికరాలనే కొనుగోలు చేయాలని సూచించారు.పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా అవార్డులు ఇచ్చి సన్మానించాలన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మంత్రి పదవులు వారికే దక్కాయి.. వైకాపాలోనే ఈ ప్రచారం: చంద్రబాబు
    ముఖ్యమంత్రి జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు వైకాపాలోనే ప్రచారం జరుగుతోందని అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అవినీతి ఉన్నమాట నిజమే.. అరికడతాం : మంత్రి
    దేవదాయశాఖలో అవినీతి ఉన్నమాట వాస్తవమేనని మంత్రి కొట్టు సత్యనారాయణ కుండ బద్ధలు కొట్టారు. విజయవాడలో దేవదాయశాఖ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలవరానికి అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధం: కేంద్రమంత్రి
    పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.13 వేల కోట్ల పైచిలుకు నిధులు చెల్లించామని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ స్పష్టం చేశారు. పోలవరం పూర్తికి అన్ని రకాలుగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిన మాట వాస్తవమేనని.. దీనిపై కమిటీ అధ్యయనం చేస్తోందని అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం
    గురువారం ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సిక్కు గురువు తేగ్ బహదూర్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. తేగ్​ బహదూర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆర్మీ చీఫ్​గా మనోజ్ పాండే- తొలిసారి ఇంజినీర్​కు సైన్యం బాధ్యతలు
    భారత సైన్యం తదుపరి సారథిగా లెఫ్టినెంట్ జనరల్​ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ పాండేను నరవాణే వారసుడిగా ఎంపిక చేసింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రష్యా గుప్పిట్లో మరియుపోల్.. ఏడు వారాల తర్వాత కీలక నగరం స్వాధీనం
    ఉక్రెయిన్​ కీలక నగరం మరియుపోల్​ను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ తరఫున ఇంకా పోరాడుతున్న కొద్దిమందిని మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో బంధించినట్లు రష్యా తెలిపింది. దాదాపు నగరమంతటినీ గుప్పిట పట్టామని, మిగిలినవారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కుప్పకూలిన ఐటీ సెక్టార్​- సెన్సెక్స్​ 1172 డౌన్​
    అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలకు తోడు ఐటీ ఇండెక్స్​ కుప్పకూలటం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ ఏకంగా 1170, నిఫ్టీ 300 పాయింట్లకుపైగా నష్టపోయాయి. స్టాక్​ మార్కెట్ల భారీ నష్టాలకు ప్రధాన కారణాలు తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'కేజీఎఫ్​ 2': రాఖీభాయ్​దే హవా.. వరల్డ్​లోనే రెండో చిత్రంగా!
    కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ 2' గ్లోబల్​ బాక్సాఫీస్​ ముందు రికార్డు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు బాలీవుడ్​లోనూ అత్యంత వేగంగా రూ.200కోట్ల క్లబ్​లో చేరే తొలి చిత్రంగానూ ఘనత సాధించనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాజస్థాన్ హవా.. బ్యాటింగ్‌లో బట్లర్‌.. బౌలింగ్‌లో చాహల్!
    ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ఛాంపియన్ టీమ్​లు డీలా పడినప్పటికీ.. కొత్త జట్లు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు దంచికొడుతుండగా.. బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఎక్కువ రన్స్ చేసింది ఎవరు? ఎక్కువ వికెట్లు తీసింది ఎవరో చూసేద్దామా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details