- ఎర్రచందనం వేటలో.. వెంటాడిన మృత్యువు
ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తమిళనాడు స్మగ్లర్లు మృత్యవాత పడటం తీవ్ర కలకలం రేగుతోంది. రెండుకార్లు, టిప్పర్ దగ్ధమైన ఘటనలో ఐదుగురు స్మగ్లర్లు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- వైకాపా అసమర్థత వల్లే పోలవరానికి నిధులు రావడం లేదు: తెదేపా
పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేకపోవటం వైకాపా నేతల వైఫల్యమేనని తెదేపా నేతలు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల ఎదుట బైఠాయించి.. పోలవరం పూర్తి చేయాలని డిమాండ్ చేయాలని ప్రజలకు తెదేపా నేతలు సూచించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మచ్చలేని చరిత్ర ఆయన సొంతం: తెదేపా అధినేత చంద్రబాబు
ఉన్నత విలువలకు ఎర్రన్నాయుడు ప్రతి రూపమని...తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న ప్రజానేత ఎర్రన్నాయుడని అన్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పాసవాన్ మృతిపై దర్యాప్తునకు మాంఝీ డిమాండ్
లోక్జన్శక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాసవాన్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని హిందుస్థానీ అవామ్ మోర్చా డిమాండ్ చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఇవి స్వదేశీ బార్బీ బొమ్మలు గురూ!
బార్బీ బొమ్మలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అలాగే భారత్లోని రాంచీ బొమ్మలకూ ఎంతో గుర్తింపు ఉంది. దేశసంస్కృతిని ప్రతిబింబించే వీటిని ఎలా తయారు చేస్తారు, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఉరివేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
అసోంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఇందుకు కారణం ఏంటన్నది తెలియరాలేదు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 25 కోట్ల మార్క్ దాటిన ఫోన్పే రిజిస్టర్డ్ యూజర్స్
ప్రముఖ డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్ ఫోన్పే.. రిజిస్టర్డ్ యూజర్ల సంఖ్య 250 మిలియన్ల మార్క్ దాటినట్లు ప్రకటించింది. అక్టోబర్లో నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 100 మిలియన్లుగా నమోదైనట్లు తెలిపింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- న్యూజిలాండ్ మంత్రిగా ప్రియాంక
న్యూజిలాండ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా ప్రియాంక రాధాకృష్ణన్ చరిత్ర సృష్టించారు. కివీస్ ప్రధాని జెసిండా అర్డెర్న్ కేబినెట్లో సామాజిక, స్వచ్ఛంద విభాగ శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం దక్కింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'పృథ్వీ షా ప్రయోగాలు వద్దు.. సెహ్వాగ్లా ఆడు'
దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా.. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ను రోల్ మోడల్గా తీసుకుని ఆడాలని సూచించాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మగబిడ్డకు జన్మనిచ్చిన 'అతిథి' హీరోయిన్
హీరోయిన్ అమృతరావు.. పండంటి మగబిడ్డకు ఆదివారం జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి