ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్యురాలి కేసును సీబీఐతో విచారణ జరిపించాలి: పంచుమర్తి అనురాధ

వైద్యురాలు అనితారాణి కేసుపై తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి ఆనురాధ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బాధితురాలికి నమ్మకం లేదని...ఆమె కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

By

Published : Jun 10, 2020, 11:08 AM IST

Published : Jun 10, 2020, 11:08 AM IST

AP TDP Spokesperson Panchumarthi anuradha women doctor anitharani case seeks CBI probe into harassment
AP TDP Spokesperson Panchumarthi anuradha women doctor anitharani case seeks CBI probe into harassment

జగన్ ఏడాది పాలనలో బడుగు బలహీనవర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసించారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ ఘటన మరవకముందే అనితారాణి ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా ఇష్టానుసారం మాట్లాడారని... వైద్యురాలి పట్ల వైకాపా నాయకులు అసభ్యంగా మాట్లాడటం క్షమించరాని నేరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకనే అనితారాణి సీఐడీని తిరస్కరించారని... బాధితురాలి డిమాండ్ మేరకు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details