ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2020, 8:02 AM IST

ETV Bharat / city

టీఎస్‌ ఎంసెట్‌ రాసే ఏపీ విద్యార్థులకు సౌలభ్యం

టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్థులకు వారి సొంత రాష్ట్రంలోనే పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష కేంద్రం మార్పునకు నేడు అవకాశం కల్పించింది.

AP students writing TS eamcet in own state
టీఎస్‌ ఎంసెట్‌ రాసే ఏపీ విద్యార్థులకు సౌలభ్యం

టీఎస్‌ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు సొంత రాష్ట్రంలోనే పరీక్ష రాసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో సవరణలకు అనుమతించింది. ఏపీలోని కేంద్రాలలో పరీక్ష రాయాలనుకునేవారు ఈ నెల 23లోగా eamcet.tsche.ac.in లో కేంద్రం ఆప్షన్‌ మార్చుకోవచ్చని టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొ.ఎ.గోవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రెండో దశలో తెలంగాణ పరిధిలో కేంద్రాల మార్పునకు అనుమతిస్తామన్నారు. టీఎస్‌ ఎంసెట్‌ వచ్చే నెల 6 నుంచి 9 మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details