ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటర్ పాఠ్యాంశాలు.. 30 శాతం తగ్గింపు - ఏపీలో ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గింపు న్యూస్

ఇంటర్ సిలబస్​ను 30 శాతం కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తగ్గించిన సిలబస్ వివరాలను బోర్డు వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచింది.

eenadu2
eenadu2

By

Published : Aug 17, 2020, 4:52 AM IST

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా మార్చి నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. వాటిని ఆగస్ట్ 31వ తేదీ వరకూ మూసివేయాలని ఈ మధ్య విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం కావటం ఆలస్యం అవుతుండటంతో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 9 నుంచి 12వ తరగతుల సిలబస్​ని 30 శాతం తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇప్పటికే ప్రకటించింది. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ని 30 శాతం కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తగ్గించిన సిలబస్ వివరాలను బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

పూర్తి వివరాలను ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్​లో చూడవచ్చు. https://bie.ap.gov.in/ సాధారణంగా 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. సెప్టెంబరు 5 నుంచి కళాశాలలను ప్రారంభిస్తే 175 వరకు పనిదినాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్​లైన్ పాఠాలను ప్రారంభించారు .

ఇదీ చదవండి:'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details