ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 2, 2020, 7:26 PM IST

ETV Bharat / city

కొవిడ్ చికిత్సకు ఫీజులపై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా

కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన పిల్​పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ సమయం కోరిన మేరకు.. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.

ap high court
ap high court

కొవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు.. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ 2 వారాలు గడువు కోరారు.

ఈ క్రమంలో కేసు విచారణను హైకోర్టు 2 వారాలు వాయిదా వేసింది. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ తరఫున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details