పోలీసులు సీఆర్పీసీలోని 54, 57 సెక్షన్లు పాటించట్లేదంటూ దాఖలైన పిటిషన్కు సంబంధించి..డీజీపీ, సీఎస్లకు హైకోర్టు నోటీసులిచ్చింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలీసులు సీఆర్పీసీలోని 54, 57 సెక్షన్ల కింద అదుపులోకి తీసుకుని..చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించాకే విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనానికి నివేదించారు. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని చట్టంలో ఉందన్నారు.
HIGH COURT NOTICES: రాష్ట్ర డీజీపీ, సీఎస్కు హైకోర్టు నోటీసులు - ఏపీ తాజా వార్తలు
![HIGH COURT NOTICES: రాష్ట్ర డీజీపీ, సీఎస్కు హైకోర్టు నోటీసులు AP high court issues notices to CS and DGP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13592115-344-13592115-1636525565444.jpg)
AP high court issues notices to CS and DGP
11:54 November 10
పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ
ఈ ఏడాది ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం నేత బ్రహ్మం చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం..డీజీపీ, సీఎస్లకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:
Last Updated : Nov 10, 2021, 1:47 PM IST