ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 15, 2021, 12:54 PM IST

Updated : Feb 16, 2021, 11:03 AM IST

ETV Bharat / city

ఎమ్మెల్యే జోగి రమేశ్ మీడియాతో మాట్లాడొచ్చు: హైకోర్టు

ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. మీడియాతో మాట్లాడవచ్చని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం ఈనెల 21 వరకు పొడిగించింది.

ap sec
ap sec

తనను మీడియాతో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరితోనూ మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారని ఎస్‌ఈసీ తరుఫు న్యాయవాది అశ్వినీకుమార్‌ వాదించారు.

వాదనలు విన్న న్యాయస్థానం..జోగి రమేశ్ మీడియాతో మాట్లాడవచ్చని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈనెల 21 వరకు పొడిగించింది. ఎన్నికల ప్రక్రియ, ఎస్​ఈసీపై వ్యాఖ్యలు చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసింది.

Last Updated : Feb 16, 2021, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details