ఆంధ్రప్రదేశ్

andhra pradesh

GO on Brahmin corporation: రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు

బ్రాహ్మణ కార్పొరేషన్​ను బీసీ సంక్షేమ శాఖలో విలీన అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

By

Published : Nov 8, 2021, 7:03 PM IST

Published : Nov 8, 2021, 7:03 PM IST

ap high court
ap high court

బ్రాహ్మణ కార్పొరేషన్​ను బీసీ సంక్షేమ శాఖలో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 103పై సవాల్ చేస్తూ దాఖలైన పిల్​పై హైకోర్టు విచారించింది. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్​ను బీసీ సంక్షేమ శాఖలో విలీనం చేయటం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్​కు ప్రత్యేక నిధులు కేటాయించి.. పేద బ్రాహ్మణులకు సాయం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది . తదుపరి విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details