ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 17, 2020, 8:25 PM IST

ETV Bharat / city

వర్షాలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు

2019లో కుండపోత వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ నిధులు మంజూరు చేసింది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో దెబ్బతిన్న పంచాయతీ రహదారుల మరమ్మతుల కోసం రూ.9 కోట్ల 28 లక్షల నిధులను జారీ చేసింది.

Ap govt
Ap govt

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ నిధులు మంజూరు చేసింది. 2019లో కుండపోత వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, వీటి మరమ్మతుల కోసం పాలనానుమతులు ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంచాయతీ రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వ పాలనానుమతి జారీ అయ్యాయి. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రహదారుల కోసం 9 కోట్ల 28 లక్షల రూపాయలను విపత్తు నిర్వహణశాఖ జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details