ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాయిదా వేసిన వేతనాలు చెల్లింపునకు ఆదేశాలు జారీ - వేతనాలపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నెలలో వాయిదా వేసిన వాటిని డిసెంబర్ నెలలో చెల్లించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

ap govt
ap govt

By

Published : Dec 1, 2020, 4:38 PM IST

కొవిడ్ కారణంగా మార్చి నెలలో వాయిదా వేసిన వేతనాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను చెల్లించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు నెలలో ఈ చెల్లింపులు చేయనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. మార్చి నెలలో వాయిదా వేసిన వేతనాలు డిసెంబర్ లో.. ఏప్రిల్ నెలలో తగ్గించిన వేతనాలను 2021 జనవరిలో చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details