ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మండలి చట్టం -2020తో పాటు ఇతర కీలకమైన బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఏపీ మత్స్య విశ్వవిద్యాలయ చట్టం-2020, ఏపీ పశుగ్రాసం ఉత్పత్తి , నాణ్యత నియంత్రణ, విక్రయాల చట్టం 2020, ఏపీ అక్వాకల్చర్ సీడ్ నాణ్యత నియంత్రణ సవరణ చట్టం 2020లకు ఆమోదుముద్ర వేశారు. ఈ చట్టాలను అధికారిక రాజపత్రంలో ముద్రించాల్సిందిగా న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పలు కీలక బిల్లులకు గవర్నర్ ఆమోదం - రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మండలి చట్టం -2020తో పాటు ఇతర బిల్లులను ఆమోదించారు.

governor biswabhusan harichandan