AP Governor Biswabhusan Fell Sick: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు(AP Governor Bishwabhushan Fell Sick) గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఓ డయాగ్నిస్టిక్ సెంటర్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం....ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి(ap Governor shifted to AIG Hospital at Hyderabad) తరలించారు. ఇటీవల గవర్నర్ కరోనా బారినపడి కోలుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని నగరానికి వచ్చారు .
AP Governor Bishwabhushan Fell Sick: గవర్నర్ బిశ్వభూషణ్కు మరోసారి అస్వస్థత - ap news
22:18 November 28
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు
ఈ నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
ఈ నెల 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు.
ఆయన స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు. ఇందులో కరోనా పాజిటివ్గా తేలింది. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కొద్దిరోజుల తరువాత కోలుకున్నారు. ఈనెల 23వ తేదీనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
ఇదీ చదవండి: