ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 23, 2021, 9:10 PM IST

ETV Bharat / city

భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు: మంత్రి పేర్నినాని

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్‌కు.. ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

Minister Perni Nani
మంత్రి పేర్నినాని

కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈనెల 26 న రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైకాపా సహా ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని మంత్రి పేర్నినాని తెలిపారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని సీఎం జగన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని మంత్రి చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బంద్‌లో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details