ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్థిక శాఖ లీకులపై ఆందోళన..  మీడియాలో కథనాలపై మల్లగుల్లలు.. - ap govenment financial issues

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియాలో వస్తున్న వార్తలు.. ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. అడ్డుకట్టకు చర్యలు ప్రారంభించింది. సమావేశాల్లో అధికారులిచ్చే ప్రజెంటేషన్ల వివరాలు లీక్‌ కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.

ap government high alert on government information
ap government high alert on government information

By

Published : Aug 26, 2021, 7:46 PM IST

ఆర్థిక శాఖ నుంచి లీకుల కారణంగా ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీన్ని నిరోధించే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆర్థికశాఖలోని ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌తో పాటు జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచడాన్ని నిలిపివేస్తూ ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా.. వివిధ సమావేశాల్లో అధికారులు రూపొందించే ప్రజెంటేషన్లు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతోంది. సమావేశాలు ముగిశాక ప్రజెంటేషన్ల వివరాలు ఎవరికీ అందుబాటులో లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఆర్థిక పరిస్థితిపై మీడియా కథనాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు..

ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు, ఆన్‌లైన్‌లో జీవోల నిలిపివేత వంటి చర్యలు చేపట్టినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కేంద్రంతో పాటు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, పీఏసీ, రిజర్వు బ్యాంక్‌ వంటి వివిధ సంస్థల నుంచి ఈ వివరాలన్నీ బయటకు వస్తుండటంతో.. ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. వాస్తవానికి సీఎంఓలో జరిగే వివిధ సమీక్షా సమావేశాల్లో ఆర్థిక అంశాలపై చర్చించొద్దని అధికారులందరికీ వ్యక్తిగత ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి నేరుగా సీఎంతో లేదా సీఎంఓలోని అధికారులతో మాత్రమే చర్చించాల్సిందిగా స్పష్టం చేసినట్టు సమాచారం.

ఇదీ చదవండి:

KRMB, GRMB MEETING: సెప్టెంబర్‌ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ

ABOUT THE AUTHOR

...view details