రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధిపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ భేటీలో మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, కన్నబాబు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి పరిశ్రమల వివరాలు సేకరించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు నివేదిక తయారు చేయాలని నిర్దేశించారు.