ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2020, 6:36 PM IST

ETV Bharat / city

'ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు'

రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఉన్నత స్థాయి కమిటీ భేటీలో మంత్రులు బొత్స, బుగ్గన, కన్నబాబు నిర్ణయించారు. ఫుడ్​ ప్రాసెసింగ్​ జోన్స్​ ఏర్పాటుకు నివేదిక తయారు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

'ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు'
'ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు'

రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధిపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ భేటీలో మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, కన్నబాబు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​, అగ్రి పరిశ్రమల వివరాలు సేకరించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు నివేదిక తయారు చేయాలని నిర్దేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details