ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆదివారం నుంచి ఈ-పాస్ లను జారీ చేయనున్నట్లు కొవిడ్ ప్రత్యేకాధికారి కృష్ణబాబు తెలిపారు. వివరాలను స్పందన వెబ్సైట్లో నమోదు చేసుకుంటే.. ఆటోమేటిక్ విధానంలో మొబైల్, ఈ-మెయిల్ లకు వెంటనే ఈ-పాస్ లు జారీ అవుతాయని వివరించారు. చెక్ పోస్టుల వద్ద గుర్తింపు పత్రం, ఈ-పాస్ చూపితే అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు, తర్వాత ఆరా తీసేందుకు మాత్రమే స్పందనలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగానే క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సిబ్బంది తనిఖీలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
నమోదు చేసుకున్న వెంటనే ఈ-పాస్.. నేటి నుంచి జారీ - ఏపీలో ఈ పాస్ విధానం
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆదివారం నుంచి ఈ-పాస్ లను జారీ చేయనున్నట్లు కొవిడ్ ప్రత్యేకాధికారి కృష్ణబాబు తెలిపారు. స్పందన వెబ్సైట్లో నమోదు చేసుకుంటే.. ఆటోమేటిక్ విధానంలో మొబైల్, ఈ-మెయిల్ లకు వెంటనే ఈ-పాస్ లు జారీ అవుతాయని వివరించారు.
![నమోదు చేసుకున్న వెంటనే ఈ-పాస్.. నేటి నుంచి జారీ ap e pass issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8263533-80-8263533-1596329465854.jpg)
ap e pass issue