ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 238 మందికి కరోనా.. ముగ్గురు మృతి - 02.01.2021 ఏపీ కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో 238 మందికి కొత్తగా కరోనా సోకగా.. 279 మంది కోలుకున్నారు. తాజా గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 8,82,850కి చేరింది. పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చొప్పున వైరస్ వల్ల మరణించారు.

ap corona bulletin
ఏపీ కరోనా బులెటిన్

By

Published : Jan 2, 2021, 7:07 PM IST

రాష్ట్రంలో గత 24 గంటల్లో 48,518 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 238 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 279 మంది పూర్తిగా కోలుకోగా.. వైరస్ ధాటికి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 59 మంది, శ్రీకాకుళం నెల్లూరులలో అత్యల్పంగా నలుగురు.. మహమ్మారి బారిన పడ్డారు. కృష్ణా గుంటూరుల్లో 32, పశ్చిమ గోదావరిలో 22, విశాఖలో 21, కడపలో 16, తూర్పు గోదావరిలో 15, కర్నూలు అనంతపురంలలో 11, ప్రకాశంలో 6, విజయనగరంలో 5 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,19,32,603 నమూనాలను పరిశీలించగా.. మొత్తం 8,82,850 మందికి కరోనా నిర్ధరణ జరిగినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 8,72,545 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోగా.. 3,194 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. 7,111 మంది కొవిడ్ ధాటికి మృతి చెందారని తెలిపింది.

ఏపీ కరోనా బులెటిన్

ABOUT THE AUTHOR

...view details