ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 95 కరోనా కేసులు.. ఒకరు మృతి - ఏపీ కరోనా వార్తలు

రాష్ట్రంలో కొత్తగా మరో 95 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఒకరు మరణించారని వైద్యారోగ్య శాఖ బులెటిన్​లో పేర్కొంది.

ap corona cases updates
ap corona cases updates

By

Published : Feb 3, 2021, 7:22 PM IST

Updated : Feb 3, 2021, 8:11 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,445 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 95 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,88,099కు చేరింది. గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు విడిచారు.

ఇప్పటివరకు 7,157మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 129మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8.79 లక్షలకు పైగా చేరింది .రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 32 లక్షలు దాటాయి.

ఇదీ చదవండి: పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Last Updated : Feb 3, 2021, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details