ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM delhi tour: సీఎం జగన్​ దిల్లీ పర్యటన.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ - ap cm jagan to meet pm modi

CM delhi tour: ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ దిల్లీ బయల్దేరారు. సాయంత్రం ప్రధానితో భేటీ కానున్నారు. అమిత్‌ షాతో సీఎం భేటీకీ సీఎంవో అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిపింది.

ap cm jagan delhi tour
సీఎం జగన్ దిల్లీ పర్యటన

By

Published : Apr 5, 2022, 1:08 PM IST

Updated : Apr 5, 2022, 1:53 PM IST

CM Jagan Delhi Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్సి జవహర్‌రెడ్డి కూడా సీఎం వెంట దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీని.. 6 గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్​ను.. అలాగే రాత్రి 9.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాను సీఎం జగన్​ కలవనున్నారు.

నూతన జిల్లాల ఏర్పాటు వివరాలను మోదీ, అమిత్‌షాకు జగన్ వివరిస్తారని సమాచారం. భారీగా అప్పులు చేస్తున్న రాష్ట్రాలు, ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటాయని ఇటీవల ప్రధానికి ఉన్నతాధికారులు నివేదించారనే సమాచారంతో... ఈ అంశం కూడా మోదీతో జగన్‌ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని సమాచారం. ఈ రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి... రేపు ఉదయం మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ABV Rao: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీకి సర్కార్​ షోకాజ్ నోటీసు

Last Updated : Apr 5, 2022, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details