ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లాయర్​ దంపతుల హత్యను ఖండించిన ఏపీ బార్ కౌన్సిల్

By

Published : Feb 19, 2021, 8:42 AM IST

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య ఘటనను ఏపీ బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. అలాగే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది . మృతుల కుటుంబ సభ్యులకు కౌన్సిల్ సంతాపం ప్రకటించింది.

AP Bar Council
లాయర్​ దంపతుల హత్యను ఖండించిన ఏపీ బార్ కౌన్సిల్

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు , నాగమణిల హత్యను ఏపీ బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులను అత్యంత కిరాతకంగా చంపిన నేరగాళ్లను అరెస్ట్ చేయాలని తెలంగాణ డీజీపీ , రామగుండం పోలీసు కమిషనర్​కు విజ్ఞప్తి చేసింది. అసాంఘిక శక్తులు ఇటీవల న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్నారని.. వాటి నియంత్రించాలని తెలిపింది. లేదంటే న్యాయవాదులు సక్రమంగా విధులు నిర్వహించలేరని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ కారణంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. మరోవైపు న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ.. ఏపీ రాష్ట్ర లీగల్ కమిటీ , హైకోర్టు న్యాయవాదులు సంయుక్తంగా హైకోర్టు వద్ద నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details