ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసెంబ్లీ కమిటీల ఏర్పాటు.. ఛైర్మన్లు వీళ్లే - ap assembly new commites anounced news

శాసనసభ, శాసన మండలిలో పలు కమిటీలను నియమిస్తూ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ప్రకటన విడుదల చేశారు.

ap-assembly-anounced-new-commites-bulliten released by-assembly-secretary

By

Published : Nov 12, 2019, 11:47 PM IST

ఉభయ సభల సభ్యులతో పలు కమిటీలు ఏర్పాటు చేస్తూ శాసనసభ కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. వసతుల సౌకర్యాల కమిటీ సహా అటవీ, పర్యావరణ సంరక్షణ కమిటీ ఛైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.

  • ఎస్సీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ - గొల్ల బాబురావు
  • ఎస్టీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ - తెల్లం బాలరాజు
  • మైనార్టీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ -షేక్ మహ్మద్ ముస్తఫా
  • స్త్రీ శిశు సంక్షేమ, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ కమిటీ ఛైర్మన్ - విశ్వసరాయి కళావతి
  • బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ -జంగా కృష్ణమూర్తి
  • లైబ్రరీ కమిటీ ఛైర్మన్ - అంగర రామ్మోహన్
  • సబార్డినేట్ లెజిస్ట్లేషన్ కమిటీ ఛైర్మన్ - శమంతకమణి

శాసనమండలి సభ్యులతో పలు కమిటీలు

తెలుగు, సంస్కృతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ నియామకమయ్యారు.

  • ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ - ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి
  • పిటిషన్స్ కమిటీ ఛైర్మన్ - రెడ్డి సుబ్రమణ్యం
  • పేపర్స్ లెయిడ్ ఆన్ టేబుల్ కమిటీ ఛైర్మన్ -వైవిబీ రాజేంద్ర ప్రసాద్

ఆరుగురు సభ్యులతో సభా హక్కుల కమిటీని ప్రకటించారు. ఛైర్మన్ గా దేవసాని చిన్న గోవింద రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్​గా జి. తిప్పేస్వామి నియామితులయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details