ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపాలోకి విశాఖ తెదేపా ఎమ్మెల్యే?

By

Published : Sep 19, 2020, 8:57 AM IST

అధికార వైకాపాలోకి.. తెదేపాకు చెందిన మరో ఎమ్మెల్యే చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. విశాఖ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడితో సహా కలవనున్నట్లు సమాచారం.

tdp mla
tdp mla

విశాఖ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తన కుమారుడితో సహా.. నేడు కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని సమాచారం. ఆ ఎమ్మెల్యే కుమారుడికి సీఎం వైకాపా పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తారని... అనంతరం.. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు ఆ ఎమ్మెల్యే మద్దతు తెలుపుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో.. నగరానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, మీడియా ప్రతినిధులు.. ఆయనను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.

ABOUT THE AUTHOR

...view details