తెలంగాణలోని కార్మిక బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్)... మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. తేజ ఫార్మసీ ఎండీ రాజేశ్వర్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డిని అదుపులోకి తీసుకుని అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది. శ్రీనివాస్రెడ్డి నివాసంలో సోదాలు జరిపిన విచారణ అధికారులు పెద్దఎత్తున బిల్లులు, నకిలీ ఇండెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణి- శ్రీనివాస్రెడ్డిల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. కాగా శ్రీనివాస్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అధికారులు అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు.
తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం... మరొకరు అరెస్టు - ఈఎస్ఐ కుంభకోణం
తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు... మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

అనిశాకు పట్టుబడిన శ్రీనివాస్రెడ్డి