ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

By

Published : Apr 13, 2021, 10:18 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 3052 కేసులు నిర్ధరణ కాగా.. వైరస్ బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వైరస్
corona cases in telangana

తెలంగాణలో రెండో దశ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం.. 1,13,007 మందికి కొవిడ్​ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,052 మందికి వైరస్ పాజిటివ్​గా ఫలితం వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 406 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3,32,581కు చేరింది.

కొవిడ్​ కోరల్లో చిక్కి మరో ఏడుగురు మరణించగా.. ఇప్పటి వరకు 1,772 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి తాజాగా మరో 778 మంది బాధితులు కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 16,118 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్​ కేసులున్నాయి.

ABOUT THE AUTHOR

...view details