ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2021, 7:58 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 97 కరోనా కేసులు.. ఒకరు మృతి

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 97 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 179 మంది కోలుకోగా.. ఒకరు మరణించారు. మరో 1,071 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

andhrapradesh carona bulletin
రాష్ట్రంలో కొత్తగా 97 కరోనా కేసులు, ఒకరు మృతి

రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,876 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 97 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 179 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కోటీ 32 లక్షల 76 వేల 678 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

8 లక్షల 88 వేల 275 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 8 లక్షల 80 వేల 46 మంది మహమ్మారి నుంచి కోలుకోగా..7,158 మంది మృతి చెందారని వివరించింది. ఇప్పటికీ.. 1,071 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రంలో కొత్తగా 97 కరోనా కేసులు, ఒకరు మృతి

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details