- రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలు
రైతుల రెక్కల కష్టాన్ని నివర్ తుపాను నీళ్లపాలు జేసింది. రాయలసీమతోపాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అన్నదాతలను ఆశల సాగును నిండాముంచింది. వేల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిలో నానుతుంది. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రెండు వారాల్లో 2 వాయుగుండాలు..!
వచ్చేనెల 10వ తేదీలోపు బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఏర్పడేందుకు అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఓ అల్పపీడనం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది 30వ తేదీలోపు వాయుగుండంగా మారి, ఆ తర్వాత మరింత బలపడే అవకాశాలున్నాయని వెల్లడించారు. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. విహంగ వీక్షణం ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పర్యటించి వరద నష్టంపై ఆరా తీయనున్నారు.పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'డిసెంబరు 31లోగా నివర్ నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం'
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం డిసెంబరు 31లోగా నష్టపరిహారాన్ని చెల్లించనుంది. ఇందుకోసం డిసెంబరు 15 కల్లా నష్టపరిహారాన్ని నిర్ధారించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించింది. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నేడు తితిదే పాలకమండలి భేటీ...ఆర్థిక పరిస్థితులపై చర్చ
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు అనుమతి, ఆరున్నర కిలోల బంగారంతో శ్రీవారి ఆలయ మహాద్వార తలుపులకు తాపడం వంటి పలు కీలక అంశాలపై పాలకమండలి భేటీలో చర్చనుంది. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నేడు మూడు నగరాలకు మోదీ-టీకాపై సమీక్ష