ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 6:22 AM IST

Updated : Feb 17, 2021, 6:26 PM IST

ETV Bharat / city

పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

అధికారులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని మరో వర్గం ఆందోళన
అధికారులు ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని మరో వర్గం ఆందోళన

18:24 February 17

మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్ నమోదు

మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్ 

మూడోవిడత: అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్‌
మూడోవిడత: అత్యల్పంగా విశాఖ జిల్లాలో 69.28 శాతం పోలింగ్‌
మూడోవిడత ఎన్నికలు: శ్రీకాకుళం జిల్లాలో 80.13 శాతం పోలింగ్‌
మూడోవిడత ఎన్నికలు: తూ.గో. జిల్లాలో 74.8 శాతం పోలింగ్‌

మూడోవిడత ఎన్నికలు: ప.గో. జిల్లాలో 82.73 శాతం పోలింగ్‌

మూడోవిడత ఎన్నికలు: కృష్ణా జిల్లాలో 84.65 శాతం పోలింగ్‌
మూడోవిడత ఎన్నికలు: గుంటూరు జిల్లాలో 84.8 శాతం పోలింగ్‌

మూడోవిడత ఎన్నికలు: ప్రకాశం జిల్లాలో 82.42 శాతం పోలింగ్‌
మూడోవిడత ఎన్నికలు: నెల్లూరు జిల్లాలో 83.15 శాతం పోలింగ్‌
మూడోవిడత ఎన్నికలు: చిత్తూరు జిల్లాలో 83.04 శాతం పోలింగ్‌

మూడోవిడత ఎన్నికలు: కడప జిల్లాలో 72.85 శాతం పోలింగ్‌

మూడోవిడత ఎన్నికలు: కర్నూలు జిల్లాలో 83.1 శాతం పోలింగ్‌
మూడోవిడత ఎన్నికలు: అనంతపురం 80.29 శాతం పోలింగ్‌

15:31 February 17

ముగిసిన మూడో విడత పోలింగ్

  • ముగిసిన మూడోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 2,639 సర్పంచి, 19,553 వార్డుల్లో పోలింగ్ పూర్తి

15:14 February 17

2.30 గంటల వరకు పోలింగ్​ శాతాలు

  • మధ్యాహ్నం 2.30 వరకు విజయనగరం జిల్లాలో 84.6 శాతం పోలింగ్‌
  • మధ్యాహ్నం 2.30 వరకు గుంటూరు జిల్లాలో 81.93 శాతం పోలింగ్‌

14:58 February 17

పశ్చిమగోదావరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • పశ్చిమ గోదావరి జిల్లా: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌
  • జిల్లాలోని 32 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 131 పంచాయతీల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌

14:56 February 17

విశాఖ మన్యంలో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

  • విశాఖ: మన్యంలోని 11 మండలాల్లో ముగిసిన పోలింగ్‌
  • కాసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

14:13 February 17

ఓటు వెయడానికి వెళ్తూ.. ప్రమాదం

  • విశాఖ: ముంచంగిపుట్టు మండలం సుత్తిగూడ వద్ద జీపు బోల్తా
  • ఓటేసేందుకు లక్ష్మీపురం వస్తుండగా సుత్తిగూడ వద్ద జీపు బోల్తా
  • 10 మందికి తీవ్రగాయాలు, ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలింపు

14:12 February 17

విశాఖ జిల్లాలో ముగిసిన పోలింగ్‌

  • విశాఖ జిల్లాలో ముగిసిన పోలింగ్‌
  • 11 మండలాల్లో ముగిసిన పోలింగ్‌
  • కాసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి

13:46 February 17

పోలింగ్ శాతం..

మధ్నాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్ శాతం

మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్నాహ్నం 12.30  గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 66.48 శాతం పోలింగ్ నమోదైంది. 

13:44 February 17

ఇరువర్గాల మధ్య ఘర్షణ

  • విజయనగరం జిల్లా పూసపాటిరేగ మం. చౌడవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చే విషయంలో ఘర్షణ
  • పోలింగ్ కేంద్రం వద్ద గొడవకు దిగిన ఇరువర్గాలు
  • పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

12:10 February 17

ప్రలోభాల పర్వం..

పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ప్రలోభాలు

                      చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.  కుప్పం మండలం వెండుగాంపల్లిలో వైకాపా మద్దతు అభ్యర్థులకు ఓటేయాలంటూ.. వైకాపా నాయకులు బహిరంగంగానే అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి.. ప్రభుత్వ పథకాలు కావాలంటే అధికార పార్టీ మద్దతు అభ్యర్థికే ఓటు వేయాలంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కరపత్రాలను చూపిస్తూ వైకాపా నాయకులు బాహాటంగానే ఓటర్లను ప్రాధేయపడుతున్నా... అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

12:05 February 17

ఎన్నికల అధికారి మృతి

  • తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్‌ కేంద్రంలో అధికారికి గుండెపోటు
  • ఏపీవో దైవకృపావతికి గుండెపోటు రావడంతో కాకినాడ ఆస్పత్రికి తరలింపు
  • కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏపీవో మృతి

11:38 February 17

ఓటరు స్లిప్పులతో.. గుర్తులు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధి శాంతిపురం మండలం మఠం పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులతో పాటు గుర్తు ముద్రించిన స్లిప్పులు పంపిణీ చేయడాన్ని గుర్తించి వారిని అడ్డుకున్నారు. మంగళవారం రాత్రే ఈ స్లిప్పులను పంపిణీ చేశారని ఓటర్లు చెబుతుండగా  దీనిపై తెలుగుదేశం మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

11:05 February 17

పోలింగ్ శాతం..

ఉదయం 10.30 గంటలకు పోలింగ్ శాతం

మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం పదిన్నర గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 40.29 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 50.70 శాతం ఓటింగ్ రికార్డయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. విశాఖలో 43.35శాతం పోలింగ్ నమోదవగా.. శ్రీకాకుళం 42.65, తూర్పుగోదావరి 33.52, పశ్చిమగోదావరి జిల్లాలో 32 శాతం ఓట్లు పడ్డాయి. ఇక కృష్ణా జిల్లాలో 38.35 శాతం, గుంటూరు 45.90, ప్రకాశం 35.90, నెల్లూరు 42.16, చిత్తూరు 30.59, కడప జిల్లా 31.73 శాతం పోలింగ్ రికార్డయింది. కర్నూలు జిల్లాలో 48.72 శాతం, అనంతపురం జిల్లాలో 48.15 ఓట్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది

10:20 February 17

అధికారికి గుండెపోటు

  • తూ.గో.: చింతూరు మం. కొత్తపల్లి పోలింగ్‌ కేంద్రంలో అధికారికి గుండెపోటు
  • ఏపీవో దైవకృపావతికి గుండెపోటు, కాకినాడ ఆస్పత్రికి తరలింపు

09:57 February 17

ఎన్నికల రోజున గ్రామాల్లో ఎంపీ పర్యటన..!

వెండుగంపల్లె, గోనుగూరు పంచాయతీల్లో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పర్యటన
  • చిత్తూరు: కుప్పం మండలంలో పర్యటిస్తున్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
  • కుప్పం మండలం వెండుగంపల్లె, గోనుగూరు పంచాయతీల్లో పర్యటన
  • స్థానికేతరుడు పర్యటిస్తున్నారంటూ పోలీసులకు తెదేపా నాయకుల ఫిర్యాదు

09:12 February 17

పోలింగ్ శాతం..

ఉదయం 8.30 గంటలకు పోలింగ్ శాతం

మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటలకు 11.90 శాతం పోలింగ్ నమోదైంది.  గుంటూరు జిల్లాలో అత్యధికంగా 18.83 శాతం పోలింగ్ నమోదైంది.  కడప జిల్లాలో అత్యల్పంగా 7.57 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 12.87, విజయనగరంలో 15.3, విశాఖలో 13.75, తూర్పుగోదావరిలో 14.63, పశ్చిమగోదావరిలో 11.72, కృష్ణాలో 8.14, ప్రకాశంలో 8.04, నెల్లూరులో 9.10, చిత్తూరులో 9.34, కర్నూలు జిల్లాలో 15.39, అనంతపురం జిల్లాలో 9.97 శాతం పోలింగ్ నమోదైంది.

08:53 February 17

ఓటర్ల నుంచి బ్యాలెట్‌ పత్రాలు లాక్కొని ఓట్లు..!

  • అనంతపురం: ఆత్మకూరు మం. తోపుదుర్తిలో ఆందోళన
  • ఓటర్ల నుంచి బ్యాలెట్‌ పత్రాలు లాక్కుంటున్నారని ఓ వర్గం ఆరోపణ
  • బ్యాలెట్‌ పత్రాలు లాక్కొని ఓట్లు వేసుకుంటున్నారని ఆందోళన
  • జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత

08:22 February 17

సర్పంచ్‌ అభ్యర్థి గృహనిర్బంధం

సర్పంచ్‌ అభ్యర్థి గృహనిర్బంధం
  • శ్రీకాకుళం: పాలకొండ మం. అంపిలి సర్పంచ్‌ అభ్యర్థి గృహనిర్బంధం
  • పాత కేసుల నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థిని గృహనిర్బంధించిన పోలీసులు
  • ప్రత్యర్థి అభ్యర్థి పోలింగ్‌ కేంద్రంలోనే ఉన్నారని మరో వర్గం ఆందోళన

07:59 February 17

నామినేషన్‌ ఉపసంహరించుకున్నా.. బ్యాలెట్‌ పత్రంలో గుర్తు

అనంతపురం జిల్లా ఉరవకొండ మూడో వార్డులో పోలింగ్ వాయిదా పడింది. ఓ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నా బ్యాలెట్‌ పత్రంలో గుర్తు కేటాయించడాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు.. అర్ధరాత్రి తర్వాత వాయిదా నిర్ణయం తీసుకున్నారు. 

07:31 February 17

ఇద్దరు అభ్యర్థులకు ఒకే గుర్తు

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాడుగులలోని 12,13 వార్డుల్లో ఇద్దరు అభ్యర్థులకు ఒకటే గుర్తుతో బ్యాలెట్ పత్రాలు ముద్రించినట్టు గుర్తించిన అధికారులు.. ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. 
 

07:30 February 17

నిలిచిన పోలింగ్‌

ప్రకాశం జిల్లా కొండపి మండలం పెద్దకండ్లగుంట 5వ వార్డులో.. అధికారులు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని మరో వర్గీయులు ఆందోళన చేస్తుండటంతో పోలింగ్ నిలిచిపోయింది. 

06:31 February 17

పోలింగ్‌ ప్రారంభం

రాష్ట్రంలో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 2,639 సర్పంచి, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ మొదలైంది. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల దాకా, మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 దాకా పోలింగ్‌ జరగనుంది.  సుమారు 55,75,004 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  

           3,221 గ్రామ పంచాయతీల్లో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచి, వార్డుసభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్‌ వేయలేదు. 31,516 వార్డు సభ్యుల స్థానాల్లో 11,753 ఏకగ్రీవమయ్యాయి. 210 స్థానాల్లో నామినేషన్‌లు దాఖలు కాలేదు. మిగిలిన 19,553 వార్డు సభ్యుల స్థానాలకు 43,162 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌ నిర్వహణకు 85 వేల మందికిపైగా అధికారులు, ఉద్యోగుల సేవల్ని వినియోగిస్తున్నారు.  

          సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్లు లెక్కింపు అనంతరం అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.  

06:30 February 17

  • రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం


 

06:09 February 17

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా మూడోదశ పంచాయతీ ఎన్నికలు
  • ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
  • 160 మండలాల్లో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • మూడోవిడత 3,221 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్ఈసీ
  • మూడోవిడతలోని 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం
  • మూడోవిడత 31,516 వార్డుల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవం
  • ప.గో., విశాఖలో 2 సర్పంచి, 210 వార్డుల్లో నామినేషన్ వేయని అభ్యర్థులు
  • నేడు 2,639 పంచాయతీ సర్పంచి స్థానాలకు పోలింగ్
  • 2,639 పంచాయతీలకు పోటీలో 7,757 మంది సర్పంచి అభ్యర్థులు
  • 19,553 వార్డు స్థానాలకు పోటీలో 43,162 మంది అభ్యర్ధులు
  • 4,118 సమస్యాత్మక, 3,127 అతి సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత
  • నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్
  • మూడో విడతలో ఓటు వేయనున్న 55 లక్షల 75 వేల ఓటర్లు
Last Updated : Feb 17, 2021, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details