ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సమరావతి.. నేడు ఉపరాష్ట్రపతితో అమరావతి రైతుల భేటీ

By

Published : Dec 23, 2019, 9:38 PM IST

Updated : Dec 24, 2019, 5:23 AM IST

అమరావతి రైతుల ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఆరు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులు... ఏడోరోజు కార్యాచరణను ప్రకటించారు. నేడు రిలే నిరాహార దీక్షలు, మహా ధర్నాలతో ఉద్యమాన్ని కొనసాగించనున్నారు.

Amravati farmers will meet with the Vice President tomorrow
అమరావతి రైతుల ఆందోళన

మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నేటి కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అదే సమయానికి వెలగపూడి, మందడంలో రైతులు ధర్నా నిర్వహించనున్నారు. తుళ్లూరులో మహాధర్నా కొనసాగించనున్నారు. వీరితోపాటు 'చలో హైకోర్టు' పేరుతో న్యాయవాదులు ఆందోళనకు దిగనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో రాజధాని రైతులు భేటీ కానున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించనున్నారు. గవర్నర్‌తో భేటీకి సమయం కోరారు.

Last Updated : Dec 24, 2019, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details