ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసత్య ప్రచారంతో రాజధానిని తరలించే కుట్ర: అమరావతి రైతులు - amaravathi farmers issue latest news

రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్‌, సభ్యుల ఎంపిక కోసం సచివాలయానికి.. వచ్చిన సీఎంకు అమరావతి రైతులు మరోసారి నిరసన తెలిపారు. జగన్ వాహనశ్రేణి వెలగపూడి సచివాలయానికి వెళ్తుండగా.. రైతులు జై అమరావతి నినాదాలు చేశారు. రైతులు రహదారిపైకి రాకుండా ఉండేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

Amravati farmers protesting as the CM convoy goes to sachivaly
సీఎం జగన్కు​ అమరావతి రైతుల నిరసన సెగ

By

Published : Mar 17, 2021, 1:55 PM IST

Updated : Mar 18, 2021, 6:54 AM IST

అమరావతిలోని అసైన్డ్‌ భూముల్లో అవినీతి జరిగిందని అసత్య ప్రచారం చేస్తూ పాలకులు రాజధానిని తరలించే కుట్ర పన్నుతున్నారని ఆ ప్రాంత రైతులు మండిపడ్డారు. అమరావతిపై కక్ష సాధించేందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో తప్పుడు కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. అమరావతిలో ఒకే సామాజికవర్గం ఉందని ఇన్నాళ్లు ఊదరగొట్టిన వైకాపా నేతలు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో, ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి అడ్డుపడుతున్న రామకృష్ణారెడ్డి చరిత్రలో రాజధాని ద్రోహిగా మిగిలిపోతారన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు బుధవారంతో 456వ రోజు కొనసాగాయి.
సీఎం కాన్వాయ్ వెళ్తుండగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు

ప్రత్యేక కెమెరాలతో నిఘా

ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయానికి వెళుతున్న సమయంలో కాన్వాయ్‌ మందడంలో శిబిరం సమీపానికి రాగానే రైతులు, మహిళలు శిబిరం ముందుకు వచ్చి అమరావతి జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు రోడ్డుపైకి రాకుండా పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. దీక్షా శిబిరం నుంచి రైతులు ఎవరూ రాకుండా, వారి కదలికలను అంచనా వేయడానికి మహిళా పోలీసులు చొక్కాకు పెట్టుకున్న ప్రత్యేక కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
పోలీసు చొక్కాకు ఉన్న కెమెరా

ఇదీ చదవండి: ఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌గా జస్టిస్‌ మందాట సీతారామమూర్తి పేరు ప్రతిపాదన..

Last Updated : Mar 18, 2021, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details